అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ట, రాజగోపుర కలశ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు పాల్గొన్నారు. నూతన ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన పసిడి కలశాల నీరాజనం, కలశ ప్రతిష్టా కార్యక్రమాల్లో వారు శాస్త్రోక్తంగా పాలుపంచుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.