కడపలో డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెడికల్, ఫార్మా రంగాల్లో నకిలీ మందులు, అవసరం లేని టెస్టులు, అధిక బిల్లులతో ప్రజల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, మందుల కొరత వల్ల ప్రజలు ప్రైవేట్ వైద్యంపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.