KDP: ఒంటిమిట్ట మండలంలోని అమ్మవారిపల్లి వద్ద కడప – చెన్నై జాతీయ రహదారిపై కంటైనర్ బోల్తా పడి డ్రైవర్ వేణుగోపాల్కు గాయాలయ్యాయి. హైదరాబాదు నుంచి చిత్తూరుకు వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడినట్లు స్థానికుల తెలిపారు. వెంటనే వారు గాయపడిన డ్రైవర్ను 108 అంబులెన్స్లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.