GNTR:అసెంబ్లీలో బుధవారం సీఎం చంద్రబాబును ప్రత్తిపాడు తెలుగు మహిళా అధ్యక్షురాలు యడ్లపల్లి వాణి మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ విద్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, కుట్టు మిషన్లు, ఉచిత స్మార్ట్ ఫోన్ల వంటి సంక్షేమ పథకాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతో దోహదపడతాయని ఆమె కొనియాడారు.