SKLM: నాగావళి నది తీరాన కొలువై ఉన్న శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని ఈవో సుకన్య ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ లెక్కింపులో ఆలయానికి రూ.2,38,567 ఆదాయం లభించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.