KDP: బద్వేల్ నియోజకవర్గం కలసపాడు(మం) పెళ్లి మర్రి చెక్ డాం సమీపంలో గురువారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. కలసపాడు నుంచి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలవడంతో అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.