సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండలంలోని 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత అందజేశారు. మొత్తం రూ.10 లక్షల విలువైన చెక్కులను స్థానిక మండల నాయకుల సమక్షంలో పంపిణీ చేశారు. ఆపద సమయంలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.