CTR: తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో డా. ఏ.శరత్ పలమనేరు గోశాలను మంగళవారం పరిశీలించారు. పశువులకు సమయానికి మేత, త్రాగునీరు, వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. 450 ఎకరాల్లో విస్తరించిన గోశాలలో ప్రస్తుతం 542 పశువులు ఉన్నాయని తెలిపారు. పచ్చిమేత సాగును విస్తరించాలని, పరిశుభ్రత, సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.