ప్రకాశం: యర్రగొండపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ 2025-26 అవగాహనా సదస్సులో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ను సమర్థంగా వినియోగించేందుకు అధికారులు సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎం.వి. సత్యనారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.