కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాల నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని MLA దేవ వరప్రసాద్ కోరారు. అంతర్వేది పల్లిపాలెం, గొంది గ్రామాల్లో గురువారం ఆయన నాయకులతో చర్చించారు. సభ్యత్వ నమోదు ఉత్సాహంగా జరుగుతోందని, 250 మంది సాధకుల కృషితో లక్ష్యం దిశగా వెళ్తున్నామని చెప్పారు. సభ్యత్వాల నమోదు గడువు పొడిగించారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.