NLR: ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోని మామిడి తోటల రైతులు నల్ల తామర, తేనె మంచు వంటి బాధలతో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను ఎదుర్కొనే అంశంపై ఉద్యానశాఖ కందుకూరులో మామిడి రైతులకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహిస్తోంది. కృషి విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు జరిగే సదస్సులో శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు చేస్తారని రైతులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.