SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలికి సుడా నిధుల నుండి రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. అధునాతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కొరకు ఈ నిధులు ఉపయోగిస్తామన్నారు. దీంతో మున్సిపాలిటీ రూపు రేఖలు మారనున్నాయన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.