అనకాపల్లి: నర్సీపట్నం ఫైర్ ఆఫీస్ వద్ద గురువారం నూతన అగ్నిమాపక వాహన సకటాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నంలో మరో నూతన అగ్నిమాపక వాహనం రావడం సంతోషంగా ఉందన్నారు. 9 మండలాల ప్రజలకు విశిష్ట సేవలు అందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి, ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.