ATP: తాడిపత్రి సమీపంలోని ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి స్వామివారు ఆలూరు గ్రామం నుంచి దేవస్థానానికి చేరుకున్నారు. అనంతరం అంకురార్పణ, ధ్వజారోహణం, కలశ స్థాపన, దీక్ష హోమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.