AKP: బొగ్గు లారీల కాలుష్యంపై ఏప్రిల్ రెండవ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి తెలిపారు. ధర్నాపై శనివారం పరవాడలో ప్రచారం నిర్వహించారు. హిందూజా, ఎన్టీపీసీ లారీలు వెదజల్లుతున్న కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. కాలుష్యం కారణంగా అనేకమంది రోగాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.