కృష్ణా: పమిడిముక్కల మండలం గోపవానిపాలెంలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు, తెలుగు ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను ఆమె స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.