KRNL: ఆదోనిలోని గౌలిపేట కిందిగేరిలో ఇటీవల గాయపడిన బోయ రామును ఎమ్మెల్యే పార్థసారథి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. నిరపరాధులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యువత అనవసర గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారి కుటుంబాలకు ఇబ్బందులు కలిగిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.