KDP: తొండూరు మండల సర్వ సభ్య సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ఎంపీపీ నారాయణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విష్ణు ప్రసాద్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీడీవో ఆఫీస్ సభా భవనంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 16 అంశాలపై చర్చిస్తామని ఎంపీడీవో అన్నారు. అయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలు తీసుకుని హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.