గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ షేక్ ఖాసిం అనే వ్యక్తి మృతి చెందినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఖాసిం ఒక లాడ్జిలో ఉంటూ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. మృతుడి పూర్తి వివరాలు గానీ, బంధువుల ఆచూకీ గానీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు, మృతుడి వివరాలు తెలిస్తే కొత్తపేట పోలీసులను సంప్రదించాలన్నారు.