W.G: జిల్లా మత్స్యశాఖ అధికారిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విజయవాడ నుంచి బదిలీపై జిల్లాకు వచ్చారు. కలెక్టర్ నాగరాణిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అస్సర రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.