VSP: ఆధునికీకరించిన భీమిలి ఆర్డీవో కార్యాలయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో ఎక్కువ ఫిర్యాదులు రెవిన్యూపైనే వస్తున్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు చేరువ కావాలని అధికారులకు సూచించారు. దివీస్ యాజమాన్యం కార్యాలయానికి సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు.