SKLM: మందస మండలం పల్లిబహడపల్లిలో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి అప్పలరాజు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వజ్రపు కొత్తూరు మండలం నువ్వులరేవులో అమ్మవారిని దర్శించుకున్నారు.