సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం మలుగూరు గ్రామపంచాయతీ బీసీ కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన సీసీ రోడ్ల పనులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా రోడ్లు అవసరమైన చోట వేయకుండా, ఇప్పటికే ఉన్న పాత రోడ్లపైనే సీసీ రోడ్లు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.