SKLM: కోటబొమ్మాలి మండలంలో ఇవాళ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పట్టు పురం పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛనుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.