SKLM: రెవెన్యూ దస్త్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ గడువులోగా పూర్తి చేయాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు.