NTR: ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్తు సరఫరానే ప్రభుత్వ లక్ష్యమని MLA వసంత కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం(M) కిలేశపురంలో రూ.4.2 కోట్ల హడ్కో నిధులతో 33/11 కెవి విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఉపకేంద్రం వల్ల లో వోల్టేజ్, బ్రేక్డౌన్ సమస్యలు తగ్గి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన విద్యుత్తు అందుతుందని తెలిపారు.