NTR: గండేపల్లిలో మట్ల ఆదివారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సంఘ కాపరి కొండ స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో సంఘ పెద్దలు, స్త్రీల మైత్రి సభ్యులు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు. విశ్వాసులు ఈత మట్టలతో ఊరేగింపు నిర్వహించి, “హోసన్నా” జయధ్వానాలతో యేసు నామాన్ని స్మరించారు. క్రీస్తు బోధనలను భక్తులకు వివరించారు.