SKLM: నరసన్నపేటలో వైసీపీ బూత్ కమిటీల సమావేశం ఇవాళ చేపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం విచారణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైసీపీ యువ నాయకులు కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా రూపకల్పన అత్యంత కీలకమని, ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.