సత్యసాయి: పుట్టపర్తి సమీపంలోని కర్ణాటనాగేపల్లి, కదిరి బస్టాండ్ పరిసరాల్లో చిత్రావతి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రెండు ట్రాక్టర్లు, ఒక హిటాచీ యంత్రాన్ని సీజ్ చేశారు. పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, గనుల శాఖ ఏడీ అమీర్ బాషా ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు.