KRNL: మండలంలోని ఎరుకలచెరువు గ్రామంలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఊరు కొండపై వెలసిన శ్రీశ్రీ తిమ్మగురుడు స్వామి ఉత్సవాలు జరగనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ నెల 19న గ్రామ దేవుళ్లకు నైవేద్యం సమర్పణ, 20న ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం కుందేలు పారి వేట, సాంస్కృతిక కార్యక్రమం, 21న వసంతోత్సవం జరుగునున్నట్లు చెప్పారు.