శ్రీకాకుళం జిల్లా రైతు సంఘం సమావేశంలో రైతుల సమస్యలు ప్రధానంగా చర్చించారు. పంటలకు సరైన మద్దతు ధరలు లేక నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ఎరువుల కొరత, అధిక ధరలు, నాసిరకం విత్తనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 20న మండల కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని రైతు సంఘం పిలుపునిచ్చింది.