ప్రకాశం: ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడుతూ.. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, రూ. 37,500 వరకు వేతనం పొందే జాబ్స్ ఉన్నట్లు ఆమె తెలిపారు.