KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని YCP మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం స్థానిక YCP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ గోడౌన్ నుంచే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అమ్ముకుంటున్నారని తెలిపారు. రేషన్ కార్డుదారులకు ప్రతినెల అరకిలో చక్కెర మినహా ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయలేదన్నారు.