ఏలూరు: మహిళలు, పోలీసులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్య చంద్రరావు మాట్లాడారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు. పని ప్రదేశాల్లో మగవారితో సమానంగా వేతనాలు పొందడం, గౌరవ ప్రదమైన వాతావరణంలో పనిచేయడం మహిళల హక్కని, ఈ దిశగా చైతన్యం తీసుకురావడమే లక్ష్యమన్నారు.