ATP: అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శివన్నకు రూ.2,45,859, నాగప్పకు రూ.1,01,208ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు.