E.G: గోకవరం ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల ప్రజా వేదిక జరిగింది. పీడీ నాగేశ్వరరావు, ఏపీడీ రాంప్రసాద్, డీవీవో రత్న కుమారి ఉపాధి హామీ పనుల రికార్డులను పరిశీలించారు. పనుల నిర్వహణలో నిబంధనలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఎస్ఆర్పీ కేవీ రమణ, ఏపీవో అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.