ATP: రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని గుత్తి మండల వ్యవసాయ అధికారి ముస్తాక్ అహ్మద్ సూచించారు. మంగళవారం మండలంలోని ఎర్రగుడి గ్రామంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా వారంలో మంగళ, బుధవారాలలో ప్రతి గ్రామంలో పొలాలను సందర్శిస్తామన్నారు.