సత్యసాయి: రాయలసీమ అభివృద్ధికి ఊతమిచ్చేలా పెనుకొండ–ధర్మవరం మధ్య 42 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్లో కీలకమైన మక్కజిపల్లి–ధర్మవరం మధ్య 30.04 కిలోమీటర్ల సెక్షన్ పనులు పూర్తి కావడంతో ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. పెనుకొండ–ధర్మవరం మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.