CTR: కుప్పంలో పోలీసులు హత్య కేసు ఛేదించారు. భార్య, ప్రియుడిని అరెస్ట్ చేశారు. మోట్లచెరువు గ్రామానికి చెందిన భూపతి (38) మార్చి 24న బిక్కలగట్టు సమీపంలోని మామిడి తోటలో ఉరివేసుకున్న స్థితిలో మృతిగా కనిపించాడు. పోలీసుల దర్యాప్తులో భూపతి భార్యతో పాటు ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచారు.