సత్యసాయి: జిల్లాలో 190 మంది కానిస్టేబుళ్ల బదిలీలను ఎస్పీ సతీష్ కుమార్ పారదర్శకంగా చేపట్టారు. సీనియార్టీ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఐదు సబ్ డివిజన్లలో సిబ్బందిని కేటాయించారు. ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని నిబంధనల ప్రకారం కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ప్రొజెక్టర్ ద్వారా ఖాళీల వివరాలను ప్రదర్శించి సిబ్బంది సమక్షంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేశారు.