KKD: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులతో శనివారం సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చలు జరిగాయి. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.