CTR: పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 11 మందికి ప్రిన్సిపల్ సివిల్ కోర్టు జడ్జి ఉమాదేవి జరిమానా విధించారు. ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున 11 మందికి లక్ష 10 వేలు జరిమానా విధించినట్లు చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు.