నంద్యాల: బసవేశ్వరుల ఆలోచనలను ఆచరణలో అమలు చేసి సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను కాపాడాలని కలెక్టర్ జీ. రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం మహాత్మా బసవేశ్వరుల 893వ జయంతి వేడుకల సందర్భంగా, ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల అర్పించి పుష్పాంజలి ఘటించారు. సమాజంలో సమాన హక్కులు, న్యాయం, ధర్మం స్థాపన కోసం ఆయన చేసిన కృషీ అపారమైందన్నారు.