కర్నూలు డివిజన్లో 22ఏ, చుక్కల భూములు, వెబ్ ల్యాండ్ సవరణలకు సంబంధించి 351 దరఖాస్తులను ఆమోదించినట్లు బుధవారం జేసీ నూరుల్ ఖమర్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో 456 ప్రతిపాదనలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. భూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, ఆర్డీవో సందీప్ కుమార్ పాల్గొన్నారు.