మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశాల మేరకు ఈనెల 25న జరిగే పాలిసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, విద్యుత్, త్రాగునీరు, వైద్య, రవాణా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. మార్కాపురం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.