KDP: పరిశ్రమలు నిర్వహించే పారిశ్రామిక వేత్తలు విద్యుత్ సమస్యలపై బుధవారం తమ కార్యాలయంలో నిర్వహించే పరిష్కార వేదికకు హాజరు కావొచ్చని APSPDCL సీఎండీ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. వినియోగదారులు నేరుగా కార్యక్రమానికి హాజరై సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.