AKP: గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. గెడ్డపాలెం, కొరుప్రోలు తిమ్మాపురం తదితర గ్రామాల్లో బుధవారం పారిశుధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. గ్రామాల్లో మురికి కాలువలను తరచూ క్లీన్ చేసి బ్లీచింగ్ వేయాలన్నారు. రహదారులపై చెత్త వెయ్యకుండా గ్రామస్తులు పంచాయతీ సిబ్బందికి సహకరించాలన్నారు.