కోనసీమ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శనివారం వివిధ సేవల ద్వారా రూ. 1.52 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ఉదయం నుంచి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం చేసుకున్న భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు.