PPM: ఫిర్యాదు చేసిన వ్యక్తి పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. మొత్తం తొమ్మిది పిర్యాదులు వచ్చాయన్నారు.