విజయనగరం: ముడిదాం సమీపంలో జాతీయ రహదారిపై విశాఖ నుంచి విజయనగరం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు విశాఖ వైపు వెలుతున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటో నుజ్జయింది. ఈ రోడ్డు ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ విజయనగరం మహారాజ హాస్పిటల్కు తరలించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.